హైదరాబాద్ లో 5జీ ప్రారంభం

                        హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది జియో .  హైదరాబాద్‌ , బెంగళూరు సిటీలో జియో 5జీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లుగా ఆ సంస్థ ప్రకటించింది. ఇప్పటివరకు ముంబై,  ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, వారణాసిలతోపాటు రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారాలో జియో 5జీ నెట్‌వర్క్‌ సేవలను పరిచయం చేయగా ఇప్పుడు భాగ్యనగరంలో సేవలు విస్తరించారు. ముందుగా ఆయా నగరాల్లో యూజర్లను ఇన్వైట్ చేసి.. ట్రయల్‌ బేసిస్‌లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. తర్వాత సాధారణ యూజర్లకు సైతం ఈ సేవలను పరిచయం చేశారు. తాజాగా, హైదరాబాద్‌, బెంగళూరు నగరాల్లో కూడా ఇదే తరహాలో 5జీ సేవలను అందిస్తున్నట్టు జియో తెలిపింది. టెక్నాలజీ నగరాలుగా గుర్తింపుపోందిన హైదరాబాద్‌, బెంగళూరుల్లో 5జీ సేవల ప్రారంభంతో,  ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగవుతాయని జియో సంస్థ  తెలిపింది.అయితే ఇందుకోసం అదనపు చెల్లింపులు అవసరం లేదు.   1జీబీపీఎస్‌ వేగంతో అపరిమిత డేటా పొందొచ్చని పేర్కొంది  ఆ సంస్థ. 500 MBPS నుంచి 1GBPSవేగంతో 5జీ నెట్‌వర్క్‌ యూజర్లకు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న సిమ్‌తోనే 5జీ సేవలు పొందవచ్చు. అయితే, యూజర్‌ కు కచ్చితంగా 5జీ ఫోన్‌ ఉండాల్సిందే.