ఈటెల గెలుపు
హుజురాబాద్ ఉపఎన్నికలలో భారతీయ జనతా పార్టీ గెపుపోందింది. తెలంగాణ రాష్ట్ర సమితి నుండి గెల్లు శ్రీనివాస్ యాదవ్పై ఈటల రాజేందర్ 23 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కేవలం రెండు రౌండ్లు మినహిస్తే మిగిలిన అన్ని రౌండ్లలో ఈటల రాజేందర్ ఆధిక్యం ప్రదర్శించారు. అన్ని రౌండ్లలో కలిపి ఈటల రాజేందర్కు 1 లక్షా 07 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. గెల్లు శ్రీనివాస్ యాదవ్కు 83వేలకు పైగా ఓట్లు వచ్చాయి. అయితే ఇక్కడ గడిచిన అన్ని ఎన్నికల్లో వరుసగా ఈటెల రాజేందర్ గెలుపోందుతూ వస్తున్నారు. 2004 నుంచి మొత్తంగా 7 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు ఈటెల.