విశాఖలో విషవాయువు ప్రమాదం...

విషవాయువులు లీక్

              విశాఖపట్టనం జిల్లాలోని ఆర్  ఆర్ వెంకటాపురం ఎల్ జీ పాలిమర్స్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదరంలో పదిమంది మృత్యువాత పడ్డారు. పలువురు ఆసుపత్రులపాలయ్యారు. అందరూ నిద్రలో ఉన్నప్పుడు విడుదలైన వాయివుతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు గాలి పిల్చలేని పరిస్థితుల్లో బయటి ప్రాంతాలకు పరుగులు తీశారు. అయితే చాలా మంది రోడ్డుపై నే కుప్పుకూలీపోయారు. పశువులు మృత్యువాతపడ్డాయి. చాలా జీవులు మృతి చెందగా, చెట్లుకూడా కమిలిపోయాయి. విశాఖలో పర్యటించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మృతులకు కోటి రూపాయల నష్టపరిహారం ఇచ్చారు. ఆసుపత్రుల్లో చికిత్సపోందుతున్న వారికి పూర్తిగా అదుకుంటామని ప్రకటించారు.  పూర్తి వివరాలు సేకరించడానికి నిపుణుల కమీటివేశారు.