తాను భూములను కబ్జా చేశానని వచ్చిన ఆరోపనలను ఖండించారు మాజీ మంత్రి హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. తాను ఎకరా భూమి కబ్జా చేసినట్లు రుజువైనా ముక్కునేలకు రాస్తానాని అన్నారు. మంత్రి స్థాయిలో తానే బెదిరించి అసైన్డ్ భూములు తీసుకుంటే మరి ముఖ్యమంత్రి స్థాయిలో హైదరాబాద్ లో ఎన్ని వేల ఎకరాలు తీసుకోని ఉండాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక భూ అక్రమణలు నిజమేనంటూ కలెక్టర్ చెప్పడం పై ఈటెల రాజేందర్ భార్య జమునా మండిపడ్డారు, అధికారులు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని చెప్పారు. ఇది కక్షసాదింపు చర్య అన్నారు.