రన్నింగ్ చేసిన రాహుల్ గాంధీ...

      భారత్ జోడో యాత్రలో ఆదివారం టీ బ్రేక్ తరువాత రాహుల్ గాంధీ మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల లోని నడుస్తుండగా కొంతమంది స్కూల్ పిల్లలు ఆయన దగ్గరికి వచ్చారు. ఈ సందర్భంగా వాళ్లను పలకరించిన రాహుల్ మనం కాసేపు పరిగెడదామా అని అడిగాడు. వాళ్లు సరే అనడంతో వన్.. టూ.. త్రీ.. చలో అంటూ రాహుల్ హైవేపైనే కొంత దూరం రన్నింగ్ చేశారు. చిన్నారులతో పాటు ఆయనతో కలిసి నడుస్తున్న వారంతా కేకలను వేస్తూ ఉత్సాహంగా పరిగెత్తారు.