ముగిసిన రాహుల్ భారత్ జూడో యాత్ర....

    రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర 23న తెలంగాణలోకి ప్రవేశించింది. జోడోయాత్ర దీపావళి  ఉన్నందువల్ల 24 నుంచి 26 వరకు విరామం తీసుకుంది. 27 నుంచి తిరిగి యాత్ర ప్రారంభించారు నవంబర్ 4వ తేదీన మరోసారి యాత్రకు విరామం పడింది. మరల 5,6 తేదీలలో యధావిధిగా సాగింది.  మొత్తంగా రాహుల్ గాంధీ తెలంగాణలో 375 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 15 కిలోమీటర్ల యాత్ర సాయంత్రం 4:00 గంటల నుంచి పది కిలోమీటర్ల యాత్ర సాగించారు రాహుల్ గాంధీ. హైదరాబాదులో నవంబర్ 1 2 తేదీలలో చార్మినార్ వద్ద నుంచి నగరం నడిబొడ్డు నుంచి రాహుల్ యాత్ర చేశారు.ఈ యాత్ర 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, 7 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఈ యాత్రను సాగిస్తూ ప్రతిరోజు సాయంత్రం కార్నర్ సమావేశాలు ఏర్పాటు చేశారు. 7వ తేదీన రాత్రి మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షులకు జోడో యాత్రను అప్పగించిన టీపీసీసీ  అధ్యక్షులు రేవంత్ రెడ్డి..