'మిస్‌ ఇండియా2020'‌గా తెలంగాణ అమ్మాయి..

  'మిస్‌ ఇండియా 2020' టైటిల్‌ను తెలంగాణ అమ్మాయి సొంతం చేసుకుంది. 23 ఏళ్ల యువ ఇంజనీర్‌ మానస వారణాసి వీఎల్‌సీసీ ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌ 2020 కిరీటాన్ని కైవసం చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన మానస  గ్లోబల్ ఇండియన్ స్కూల్లో తన విద్యాభ్యాసం పూర్తి చేసింది. వాసవి ఇంజనీరింగ్‌ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ఆమె ప్రస్తుతం  ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్‏ఛేంజ్ అనలిస్ట్‏గా పనిచేస్తోంది. 2021లో జరగబోయే 70వ మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ తరపున మానస పాల్గొననుంది.