బీజేపీలోకి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి..!

     తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీఆర్‌ఎస్‌ పార్టీని బీఆర్‌ఎస్‌గా మార్చిన సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో అరంగేట్రం చేయనున్నారు. ఇక ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పలువురు టీఆర్‌ఎస్‌ నుంచి ఇతర పార్టీలోకి జంప్‌ అవుతున్నారు. ఈ జాబితాలో ఖమ్మం జిల్లా నేతలు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల నియోజకవర్గ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి  బీజేపీలో చేరిక దాదాపు ఖరారైనట్లే కనిపిస్తోంది.