ఫలించిన శ్రీరెడ్డి పోరాటం
ఫలించిన శ్రీరెడ్డి ఫోరాటం
తెలుగు సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు పెరిగిపోయాయని సినీ నటి శ్రీరెడ్డి చేస్తున్న పోరాటం ఫలించింది. ఎన్నో ప్రశంశలు... మరెన్నో విమర్శలు ఎదుర్కోన్న శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పై భాగానే పోరాటం చేసింది. ఒంటరిగా పోరాంటా ప్రారంబించినా..., మహిళా సంఘాలు అభ్యుదయ వాదులు ఆమెకు తోడు అయ్యారు. ఈ వ్యవహరంపై ఎట్టకేలకు స్పందించిన తెలంగాణ ప్రభుత్వం ఒక కమీటిని ఎర్పాటు చేసింది.
ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 984 ప్రకారం ఈ కమిటీలో సినీనటి సుప్రియ, సినీనటి - యాంకర్ ఝాన్సీ, దర్శకురాలు నందిని రెడ్డిలను టాలీవుడ్ ప్రతినిధులుగా నియమించింది. నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వసంతి, గాంధీ మెడికల్ కళాశాల వైద్యురాలు రమాదేవి, సామాజిక కార్యకర్త విజయలక్ష్మిలతో ఈ కమిటీ ఏర్పాటైంది. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రామ్మోహన్ రావు, దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకనిర్మాత సుధాకర్ రెడ్డి కూడా ఇందులో సభ్యులుగా ఉన్నారు. రామ్మోహన్ రావు ఈ కమిటీకి చైర్మన్గా వ్యవహరించనున్నారు. సినీ పరిశ్రమకు సంబంధించిన మహిళలు తమను ఎవరైనా వేధిస్తే ఈ కమిటీ ముందు నిర్భయంగా చెప్పవచ్చని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఈ కమటి కృషి చేయ్యనుంది.