ప్రజాదరణ ఓర్వలేకే దాడి: తిక్కారెడ్డి

కర్నూలు: ​​​​​​​ప్రజాదరణను ఓర్వలేకే తనపై దాడికి తెగబడ్డారని తెలుగుదేశం పార్టీ మంత్రాలయం అభ్యర్థి తిక్కారెడ్డి ఆరోపించారు. మంత్రాలయం మండలం ఖగ్గల్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన తనపై ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి భార్య జయమ్మ, అన్న కుమారుడు ప్రదీప్ రెడ్డి దాడికి యత్నించారని చెప్పారు. తనను కాపాడేందుకు తన గన్మెన్ గాల్లోకి కాల్పులు జరిపారన్నారు. ఈ క్రమంలో గాయపడినట్లు వివరించారు. ఈ ఎన్నికల్లో 50 వేల మెజారిటీతో గెలుపొందుతానని ధీమా వ్యక్తం చేశారు. కోలుకున్నాక తిరిగి ప్రచారం చేపడతానని వివరించారు. మెరుగైన వైద్యం కోసం తిక్కారెడ్డిని కర్నూలు నుంచి హైదరాబాద్ తరలించారు.