పార్టీ మారిన 12మంది ఎమ్మెల్యేలపై టీపీసీసీ ఫిర్యాదు..

     కాంగ్రెస్ లో గెలిచి టీఆర్ఎస్ లోకి జంప్ అయిన ఎమ్మెల్యేలపై టీపీసీసీ చీఫ్ సమరం మోగించింది. పార్టీ మారిన 12మంది ఎమ్మెల్యేలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయనుంది టీపీసీసీ. దీని కోసం కాసేపట్లో సీఎల్పీ భేటీకానుంది. సీఎల్పీ సమావేశం తరువాత నేతలంతా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేయనున్నారు. పార్టీ మారిన వెనుకున్న రాజకీయంగా, ఆర్థికంగా పొందిన లాభాలను ఫిర్యాదులో పొందుపరచనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేల ఎర కేసుపై సిట్, సీబీఐ,హైకోర్టులో విచారణలు కొనసాగుతున్న తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయం సంచలనంగా మారింది. ఇది పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పై ప్రయోగించిన అస్త్రంగా కనిపిస్తోంది. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ కుట్రం చేసిందని కేసీఆర్ ఎలాగైతే ఆరోపిస్తున్నారో.. ఇప్పుడు అచ్చం అలాగే.. తమ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ కొనుగోలు చేసిందని.. కేసీఆర్‌ను టార్గెట్ చేయబోతున్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి