పసుపు - కుంకుమ 3వ విడతకు ఇసి లైన్ క్లియర్

పసుపు - కుంకుమ 3వ విడత నగదు విడుదలకు ఇసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పసుపు - కుంకుమ లబ్ధిదారులకు నిధుల విడుదలకు ఎన్నికల కోడ్ అడ్డురాదని ఇసి బుధవారం స్పష్టం చేసింది. కాగా పసుపు - కుంకుమ అమలును ఆపాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు వైసిపి నేతలు ఫిర్యాదు చేయగా..లబ్ధిదారుల ఎంపిక పూరైన కారణంగా పథకం అమలుకు ఎటువంటి ఇబ్బంది లేదని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. కాగా డ్వాక్రా మహిళలకు పసుపు - కుంకుమ పథకం కింద ఎపి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేల ప్రకటించిన విషయం విదితమే.