జ్ఞాపక శక్తి తగ్గిందా ? పంచుకోండిలా...
- జ్ఞాపక శక్తి తగ్గిందా ? పంచుకోండిలా...
ప్రస్తుతం పిల్లలలో , యువతి యువకులలో , వృద్ధులలో జ్ఞాపక శక్తి తక్కువగా వుంటుంది . క్రోధం , అత్యధికంగా చింతించిడం , భయం , ఎక్కువగా భావా వేశం కలిగి వుండడం , శోకం , ఎల్లప్పుడూ చదవడం మొదలగు కారణాల వలన జ్ఞాపక శక్తి తగ్గి పోతుందుకు కారణాలు.
మన ఇంట్లో లభించే పదార్థలతోనే చికిత్స.
1. 1/2 Spoon శంఖ పుష్పం పొడి + 1 Spoon తేనె + 250 గ్రాముల ఆవు పాలలో కలిపి ప్రతి రోజు ఉదయం త్రాగండి .
2 . శంఖ పుష్పం పొడి + బ్రాహ్మి పొడి + ఉసరి పొడి + తిప్ప తీగ పొడి + జఠామాంసి పొడి.. వీటిని సమ పాళ్ళలో కలిపి చూర్ణంగా తయారు చెయ్యండి .. ఆ చూర్ణం ని 1/2 spoon చూర్ణం + 1 గ్లాసు నీళ్ళలో కలిపి , ప్రతి రోజు ఉదయం , సాయంత్రం త్రాగండి .
3. 8 నుండి 10 బాదం పప్పులని రాత్రి ఒక గ్లాసు నీళ్ళలో నాన బెట్టండి . ఉదయం తొక్కలు తీసి పేస్ట్ లాగా చెయ్యండి .
బాదం పేష్ట్ + కొద్దిగ నల్ల మిరియాల పొడి + 250 గ్రాముల వేడి ఆవు పాలలో కలపండి .
ఈ ఆవు పాలు చల్లారిన తర్వాత , 2 spoon ల తేనె + 1 spoon దేశీయ ఆవు నెయ్యిని కలిపి త్రాగండి .
4. 8 --10 గోడంబి ముక్కలు + 1 గ్లాసు ఆవు పాలలో మరిగించి త్రాగండి . స్మరణ శక్తి పెరుగుతుంది .
5 1 Spoon అతి మధురం పొడి + 1 గ్లాసు ఆవు పాలలో కలిపి త్రాగండి .
6 . కర్బూజా పండు ముక్కలు + ఆవు నెయ్యిని కలిపి , నమిలి నమిలి తినండి . జ్ఞాపక శక్తి పెరుగుతుంది .
7 . మామిడి పండ్ల రసం + అల్లం రసం + తులసి ఆకుల రసం లను సమ పాళ్ళలో కలిపి 1 Spoon తేనె ను కలిపి త్రాగండి .
8 . సోంపు గింజల పొడి + తేనె ను కలిపి తీసుకొండి.
9 . 1 Spoon పిపిళ్ళ చూర్ణం + 1 గ్లాసు వేడి నీళ్ళలో కలిపి , ప్రతి రోజు ఉదయం , సాయంత్రం త్రాగండి .
పై వాటిలో ఏదో ఒకటి ఆచరించి , జ్ఞాపక శక్తిని పెంచు కొండి .