జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటి నోటిఫికేషన్

స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది జిహెచ్ఎంసి. ఈ నెల 3వ తేది నుండి 11వ తేది వరకు నామినేషన్ల స్వీకరణ కు అవకాశం ఉంది.  12వ తేది రోజు నామినేషన్ల స్క్రూట్నీ చేస్తారు. నామినేషన్ల ఉపసంహరణ 15తేది రోజు 3గంటల వరకు అవకాశం ఉండగా..., 20వ తేది రోజు ఉదయం 10గంటల నుండి 3గంటల వరకు ఎన్నికలు నిర్వహించనున్నారు  అనంతరం ఫలితాలు ప్రకటిస్తారు. 15 మంది  ఉండే స్టాండింగ్ కమీటిని 150 కార్పోరేటర్లు ఎన్నుకోనున్నారు. 150 ఒట్లలో అధిక ఒట్లు వచ్చిన మొదటి 15మంది స్టాండింగ్ సభ్యులుగా ఎన్నిక కానున్నారు. ఇక అధికార పార్టీకి 56 మంది ఎంఐఎంకు 44మంది సభ్యులు ఉండగా..., బిజేపి 47 మంది కాంగ్రేస్ కు 3 పాలకమండలి సభ్యులు ఉన్నారు. దాంతో టిఆర్ఎస్ ఐఎంఐ పార్టీలు ఉమ్మడిగా పోటిచేస్తే వారి సభ్యులు మాత్రమే స్టాండింగ్ కమీటికి ఎన్నిక అయ్యే అవకాశం ఉంది.