జమ్మలమడుగులో భారీగా పోలీసులు మోహరింపు

కడప: పోలింగ్‌కు మరికొన్ని గంటలే ఉండటంతో ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. జమ్మలమడుగు నియోజకవర్గంలో భారీగా పోలీసులు మోహరించారు. ఫ్యాక్షన్‌ ప్రభావిత గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేశారు. మరోవైపు కేంద్ర బలగాల కవాతు నిర్వహించారు. 2 వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రజలు నిర్భయంగా వచ్చి ఓటింగ్‌లో పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నామని జమ్మలమడుగు డీఎస్పీ కృష్ణన్‌ స్పష్టం చేశారు.