చట్టసభల్లో ప్రశ్నించే వారు ఉండాలి....

  చట్టసభల్లో వామపక్షాల ప్రతినిధులుండాలని ప్రజలు గుర్తిస్తున్నారనీ, ఉద్యోగాల పేరుతో పట్టభద్రులను మోసం చేస్తున్న పాలకపార్టీలకు ఓట్లడిగే హక్కులేదని సీపీఐ(ఎం), సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. సీపీఐ అభ్యర్థి జయసారధిరెడ్డికి మద్దతుగా వరంగల్‌ అర్బన్‌ జిల్లా కేంద్రంలో జరిగిన బైక్‌ ర్యాలీలో తమ్మినేని, చాడ పాల్గొన్నారు. అనంతరం హన్మకొండలోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.