ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన కూసుకుంట్ల..

     ఇటీవల జరిగిన మునుగోడు ఉపఎన్నికలో గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి  ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమం ఈ రోజు ఉదయం అసెంబ్లీలో జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, పువ్వాడ అజయ్  పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కూసుకుంట్లకు శుభాకాంక్షలు తెలిపారు.   దీంతో అసెంబ్లీలో టీఆర్ఎస్ బలం 104 కు చేరింది. మజ్లిస్ కు ఏడుగురు, కాంగ్రెస్ కు ఐదుగురు, బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలున్నారు.