కోవిడ్ టీకా డ్రైరన్ ను పరీశీలించిన గవర్నర్ మరియు కలెక్టర్....

             కోవిడ్ టీకా డ్రైరన్ ను పరీశీలించిన గవర్నర్ మరియు కలెక్టర్....

 

      తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కోవిడ్ టీకా డ్రై రన్ నిర్వహించింది. అందులో బాగంగా హైదరాబాద్ లో  తిలక్ నగర్ లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ కార్యక్రమాన్ని గవర్నర్ తమిళసై, జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి, ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు తదితర అధికారులు శనివారం పరిశీలించారు.  డ్రైరన్ కోసం చేసిన ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అన్నారు.  త్వరలో అందుబాటులోకి రానున్న వ్యాక్సిన్ ప్రజలకు ఏ రకంగా ఇవ్వాలి, ఇబ్బందులు తలెత్తితే తీసుకోవాల్సన జాగ్రత్తలు, సిబ్బంది పనితీరు, ఏర్పాట్లు ఎలా ఉండాలన్న అంశాలపై ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించేందుకు తీసుకున్న చర్యలను క్షుణ్ణంగా పరిశీలించారు.

      వ్యాక్సిన్ వేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల మందిని గుర్తించి జాబితా రూపొందించారని గవర్నర్ తమిళసై తెలిపారు. నాలుగు విడతలుగా వ్యాక్సిన్ అందజేస్తారని ఆమే అన్నారు. మొదటి విడతలో భాగంగా 5లక్షల మందికి వేయనున్నట్లు, ఇది సురక్షితమైన వ్యాక్సిన్ అని వివరించారు. దీన్ని హెల్త్ కేర్ వర్కర్స్‌కు ముందుగా ఇస్తారని, ఇదొక బృహత్తరమైన కార్యక్రమమని, దీనికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు భాగా పనిచేస్తున్నాయని ఈ సందర్భంగా  గవర్నర్  తెలియజేశారు.

       హైదరాబాద్ లో వ్యాక్సిన్ డ్రైరన్ ను తిలక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నాంపల్లి ఏరియా హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యశోద హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(సోమాజిగూడ), గాంధీ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోని సెంటర్లలో నిర్వహిస్తారు.