పపంచాన్ని చుట్టి వేస్తున్న కరోనా

ప్రపంచాన్ని చుట్టి వేస్తున్న కరోనా

జడలు విప్పిన మహమ్మారి  

                ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి జడలు విప్పికరాళ నృత్యం చేస్తుంది. ప్రపంచంలోని అన్ని దేశాలను చుట్టుముట్టింది. భూమండలంపై  6లక్షల 64వేల మందికి సోకింది.  వైరస్ భారిన పడి 30వేలకుపైగా మృతి చెందారు. లక్షా 25వేల కేసులతో అమెరికా కరోనా రోగుల సంఖ్యలో ముందుంది. ఇటలీ, చైనా, స్పెయిన్, జర్మనిల్లో కూడా భారీగా కేసులు నమోదు అవుతున్నాయి. ఇటలీలో 10వేల మందిని కరోనా మహమ్మారి పోట్టన పెట్టుకుంది. భారత్ లో కూడా రోజు రోజు కరోనా కేసులు పెరుగుతున్నాయి. 1000మంది కరోనా భారీన పడగా 26మంది మృతి చెందగా 86మంది రికవరి అయ్యారు. తెలంగాణలో   కరోనా రోగుల సంఖ్య  67 కాగా 1 మృతి చెందగా 1రికవరి అయ్యారు.