17,333 మందికి వరద సహాయం- GHMC

ఇప్పటికే మీసేవాల్లో ధరకాస్తు చేసుకున్న వారికి సహాయం..

 

                         గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత రెండు రోజులుగా 17,333 మందికి వరద సహాయంగా రూ. 17.33 కోట్ల ఆర్థిక సహాయం అందించినట్లు జీహెచ్ఎంసీ తెలిపింది.  నగరంలో వరద బాధితులకు ఆర్థిక సహాయాన్ని మంగళవారం నుండి ప్రారంభమైనదని, మంగళ వారం నాడు 7,939 మందికి రూ . 7.90 కోట్లను సంబంధిత లబ్ధిదారుల బ్యాంకులలో జమ చేశారని వెల్లడించింది.  నేడు బుధవారం 9,394 మంది లబ్ది దారులకు రూ. 9.39 కోట్లను అందచేయడం జరిగిందని తెలిపింది. ఈ రెండు రోజుల్లో మొత్తం  17,333 మందికి రూ. 17.33 కోట్లను బ్యాంకు ల ద్వారా అందించడం జరిగిందని జీహెచ్ఎంసీ ఒక ప్రకటనలో తెలియచేసింది.