‘వన్ నేషన్.. వన్ హెల్త్ పాలసీ’ని ఎందుకు తీసుకురారు : ఎంపీ రేవంత్ రెడ్డి

    దేశ వ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తున్న నేపథ్యంలో మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి కేంద్రం తీరుపై అసహనం వ్యక్తం చేశారు.రోజువారీగా కరోనా రక్కసి బారిన పడి దేశంలో చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆక్సిజన్, వ్యాక్సిన్ అందక కొందరు ప్రాణాలు కోల్పోతున్నారని గుర్తుచేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేంద్రం ‘వన్ నేషన్.. వన్ హెల్త్ పాలసీ’ని ఎందుకు తేవడం లేదని మండిపడ్డారు. వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలను కేంద్రం తక్షణమే స్వాధీనం చేసుకోవాలన్నారు. ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించాలని కోరారు.