హసీనాకే పగ్గాలు
బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో షేక్ హసీనా నేతృత్వ ఆవామీ లీగ్ ఆధిక్యం కనబరుస్తోంది. 350 స్థానాల జాతీయ సంగ్సద్కు జరిగిన ఎన్నికల్లో 170 స్థానాల్లో ఆవామీ ఆధిక్యంలో ఉండగా.. ప్రతిపక్ష బీఎన్పీ కేవలం 8 చోట్ల పట్టు నిలుపుకుంది. తొలిసారి కొన్నిచోట్ల ఈవీఎంలను ప్రవేశపెట్టి.. మెజార్టీ స్థానాల్లో బ్యాలెట్ పేపర్లతో జరిపిన ఈ ఎన్నికల్లో హసీనా అక్రమాలకు పాల్పడ్డారని, తిరిగి ఎన్నికలు నిర్వహించాలని కూటమి ఆరోపించింది.