సైకిల్ పై ఇంటికి డిప్యూటి మేయర్
సైకిల్ పై ఇంటికి డిప్యూటి మేయర్
జాతీయ కాలుష్య నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం లక్డికాపూల్ నుండి ఎర్రగడ్డ వరకు మెట్రో రైలులో జిహెచ్ఎంసి డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్ పర్యటించారు. అనంతరం ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ నుండి సైకిల్పై బోరబండలోని ఇంటి వరకు వెళ్లారు. కాలుష్యనివారణకు ప్రతి పౌరుడు కృషి చేయ్యాలని..., అందుకోసం విస్తృతంగా మొక్కలు నాటాలని సూచించారు.