సేవలు అభినందనీయం- మేయర్

వెంకటరమణ సేవలు అభినందనీయం- మేయర్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ చీఫ్ పబ్లిక్ రిలేషన్ అఫిసర్ గా పనిచేసిన కన్నెగంటి వెంకటరమణ రంగా రెడ్డి జిల్లాకు బదిలి అయ్యారు. అయన స్థానంలో నూతన సిపిఆర్ఓ గా వై.వెంక‌టేశ్వ‌ర్లు శుక్ర‌వారం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. గ‌త ఐదు సంవ‌త్స‌రాలుగా సిపిఆర్ఓ గా ప‌నిచేస్తున్న కె.వెంక‌ట‌ర‌మ‌ణను స‌మాచార పౌర సంబంధాల శాఖ రంగారెడ్డి జిల్లా ఉప సంచాల‌కులుగా బ‌దిలీ చేశారు. ఆ స్థానంలో వ‌రంగ‌ల్ ఉప‌సంచాల‌కులుగా ప‌నిచేస్తున్న‌ వై.వెంక‌టేశ్వ‌ర్ల‌ను నియ‌మితుల‌య్యారు. ఈ సంద‌ర్భంగా న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, జిహెచ్ఎంసి క‌మిష‌న‌ర్ డి.ఎస్‌.లోకేష్ కుమార్‌ల‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. అనంత‌రం కె.వెంక‌ట‌ర‌మ‌ణ‌కు ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్య‌క్ర‌మంలో మేయ‌ర్ ముఖ్య అతిథిగా పాల్గొని శాలువతో ఘ‌నంగా స‌త్క‌రించారు.  మేయర్ మాట్లాడుతూ న‌గ‌రంలో చేప‌ట్టిన అభివృద్ది సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల‌కు చేరువ చేయ‌డంలో వెంక‌ట‌ర‌మ‌ణ వార‌ధిగా ప‌నిచేసిన‌ట్లు కొనియ‌డారు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల‌లో కూడా ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండి మెరుగైన సేవ‌లు అందించిన‌ట్లు పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో జీవ‌న్ కుమార్‌, సునందిని, శ్రీనివాస్‌, అబ్దుల్ స‌త్తార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.