సఫాయి అన్నలకు సలామ్

సఫాయి అన్నలకు సలామ్

                              జిహెచ్ఎంసి పారిశుద్య కార్మికులు, వాటర్ బోర్డు కార్మికులు, మున్సిపాలీటి కార్మికులు, గ్రామపంచాయితీ కార్మికులు రాష్ట్రంలో 95,392మంది వరకు ఉన్నారు. వాందరు చాలా కష్టపడి నగరాలను గ్రామాలను పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారన్నారు ముఖ్యమంత్రి కేసిఆర్. గతంలో వారి  వేతనాన్ని 10శాతం కట్ చేశారని, దానిని వెంటనే ఇవ్వాలని నిర్ణయించామన్నారు.    ముఖ్యమంత్రి గిఫ్ట్ క్రింద గ్రేటర్ హైదరాబాద్ లో పనిచేస్తున్న వారికి  7,500రూపాయలు ఒక్కోక్కరికి అధనంగా అందిస్తామని ప్రకటించారు.  మున్సిపాలీటి,  గ్రామపంచాయితీ కార్మికులకు 5000రూపాయలు అందిస్తామన్నారు. అయితే  మేము ఇస్తున్నది చాలా తక్కువే అనే అభిప్రాయం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి కేసిఆర్. కాని ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించుకుంటుందని కార్మికులకు భరోసా ఇచ్చారు.   ఈ డబ్బులను  కూడా వేంటనే రిలీజ్ చేస్తామని ప్రకటించారు.