వదిలితే జరిమానా.. తింటే నజరానా
హన్మకొండ అదాలత్ కూడలిలోని లింగాల కేదారి ఫుడ్కోర్టులో ఆహారం వృథా చేస్తే జరిమానా కట్టాల్సిందే. ఈ హోటల్కు వచ్చేవారు రూ.60 చెల్లించి టోకెన్ తీసుకోవాలి. విస్తరాకుల్లో ఏ ఒక్క పదార్థం వృథా చేయకుండా తింటే రూ.10 తిరిగి ఇచ్చేస్తారు. వదిలితే మాత్రం రూ.50 జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఒకప్పుడు తిండి లేక చాలా ఇబ్బంది పడ్డానన్న యజమాని కేదారి.. ఆహారం విలువ తెలియజేయాలనే ఆలోచనతో ఈ ప్రచారం మొదలుపెట్టానని తెలిపారు.