విశాఖ సాగర తీరంలో తప్పిన పెనుప్రమాదం
విశాఖ: సాగర తీరంలో పెను ప్రమాదం తప్పింది. 120 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్న కారు సాగర్నగర్ దగ్గర డివైడర్ను ఢీకొని మంటలు అంటుకున్నాయి. దీంతో కారులో ఉన్న ఇద్దరు యువకులు సురక్షితంగా బయటపడ్డారు. స్టీల్ ప్లాంట్ దగ్గర నెల్లిముక్కు ప్రాంతం నుంచి ఇద్దరు యువకులు కారులో గీతం కాలేజీకి వెళ్తున్నారు. సాగర్నగర్ దగ్గర ఇస్కాన్ టెంపుల్ వద్దకు చేరుకోగానే... కారు డివైడర్ను ఢీకొట్టడంతో మంటలు అంటుకున్నాయి. నిఖిల్, శరత్ క్షేమంగా బయటపడటంతో తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు.