వాయుకాలుష్యంతో మధుమేహం
వాయు కాలుష్యంతో మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని ఓ అధ్యయనంలో తేలింది. ఎంత ఎక్కువగా వాయుకాలుష్యం బారిన పడితే అంత త్వరగా మధుమేహం వస్తుందని చైనా వైద్యులు తెలిపారు. 80వేల మంది చైనా వయోజనులపై 10 సంవత్సరాల పాటు పరిశోధనలు జరిపిన వైద్యులు.. గాలిలో పీఎం 2.5 ధూళి కణాలతో డైయాబెటిస్ వస్తుందని తెలిపారు. కాగా ప్రపంచంలోనే అత్యధిక డైయాబెటిస్ రోగులు చైనాలో ఉన్నారు.