వందే భారత్ రైలు ప్రారంభించటానికి HYD రానున్న ప్రధాని మోడీ
ప్రధాని మోడీ మరోసారి హైదరాబాద్ కు విచ్చేయనున్నారు. 2022లో తెలంగాణకు నాలుగు సార్లు వచ్చిన ప్రధాని మరోసారి 2023లో తొలిసారిగా హైదరాబాద్ కు రానున్నారు. జంటనగరాల్లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జనవరి (2023) 19న వందే భారత్ రైలును ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వందే భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు.