రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు.....

  రాష్ట్ర  వ్యాప్తంగా ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాత్రి నుంచి రాజధాని లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. నగరంలోని అమీర్ పేట్ , పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ప్రాంతాలతో సహా సికింద్రాబాద్ లోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చిన్న వర్షానికే నగరంలోని పలు ప్రాంతాలు వరదనీటితో నిండిపోతాయి. ఈ నేపథ్యంలో గత కొన్ని గంటలుగా భారీ వర్షం పడడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షం జనజీవనాన్ని ఇబ్బందులకు గురి చేసింది.