గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు ఊరట లభించింది. పీడీ యాక్ట్ కేసులో జైల్లో ఉన్న రాజాసింగ్కు బెయిల్ మంజూరైంది. అయితే బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం ఇకపై రాజాసింగ్ ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని ఆదేశించింది. రాజాసింగ్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ గతంలో వీడియోలను సోషల్ మీడియా(Social media)లో పోస్ట్ చేసారు రాజాసింగ్. ఆ కేసులోనే అరెస్ట్ అయ్యారు. పాత కేసులతో పాటు మరికొన్ని విద్వేష వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై పీడీ యాక్ట్ నమోదు చేసి అరెస్ట్ చేసి చర్లపల్లి జైల్లో పెట్టారు. సుమారు 40రోజులకుపైగా జైలు జీవితం గడిపిన రాజాసింగ్కు ఇప్పుడు విముక్తి కలిగింది...