మట్టి కుండ నీరు ఎంతో ప్రయోజనం
ఎండాకాలం వచ్చిందంటే చాలు చల్లటి నీటిని త్రాగాలనిపిస్తుంది. ఎండకు బయటికి వెలితే చాలు గోందు ఎండిపోతుంది. చల్లిటి నీరు తాగకుంటే మళ్లి మళ్లి నీరు త్రాగాలనిపిస్తుంది. ఇప్పుడంటే చాలా మంది ఫ్రిజ్లలోని చల్లని నీటిని తాగుతున్నారు. కానీ ఒకప్పుడు మన పెద్దలు, పూర్వీకులు కేవలం మట్టికుండల్లో ఉంచిన నీటిని మాత్రమే తాగేవారు. నిజానికి ఆ నీరే మనకు చాలా ఆరోగ్యకరం అంటున్నారు పెద్దలు. మట్టికుండల్లోని చల్లని నీటినే తాగాలని సూచిస్తున్నారు. దాంతో మనకు దాహం తీరడమే కాదు, పలు ఆరోగ్యకర ప్రయోజనాలు కూడా కలుగుతాయట.
- మట్టికుండల్లోని నీటిని తాగడం వల్ల లాభాలు
- మట్టి ఆల్కలైన్ స్వభావాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల దాంతో తయారు చేసిన కుండలో నీటిని పోస్తే ఆ నీరు కూడా ఆల్కలైన్ స్వభావాన్ని పొందుతాయి. ఈ క్రమంలో ఆ నీటిని తాగితే మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. జీర్ణ సమస్యలు పోతాయి.
- మట్టికుండలో నీటిని తాగడం వల్ల శరీర మెటబాలిజం రేటు క్రమబద్దీకరించబడుతుంది. దీంతో బరువు నియంత్రణలో ఉంటుంది.
- మట్టికుండలో నీటిని తాగితే గొంతుకు సంబంధించిన సమస్యలు దూరమవుతాయి. గొంతు ఇన్ఫెక్షన్లు, నొప్పి ఉన్నవారు కుండల్లో నీటిని తాగడం మంచిది.
- అధిక బరువుతో బాధపడేవారు మట్టికుండల్లో నీటిని తాగడం మంచిది. దాంతో బరువు తగ్గుతారు.