మే 31 వరకు సమ్మర్ హాలీడేస్

    పాఠశాలలకు, ఇంటర్మిడియట్ కళాశాలలకు మే 31 వరకు ప్రభుత్వం వేసవి సెలవులను ప్రకటించింది. ఈ ఏడాది విద్యాసంవత్సరం చివరి ‘వర్కింగ్ డే’ (ఏప్రిల్ 26) నేటితో ముగిసినట్టుగా తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం ఎప్పటి నుంచి మొదలవుతుంది, మళ్ళీ స్కూళ్ళు, జూనియర్ కాలేజీలు ఎప్పటి నుంచి తెరుచుకుంటాయనే దానిపై జూన్ 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించనుంది.