ముగిసిన మునుగోడు ఎన్నికల ప్రచారం..

    మునుగోడులో ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. నేడు సాయంత్రం వరకు ఎన్నికల ప్రచారానికి సమయం ఉండగా పలు పార్టీల నేతలు చివరిరోజు జోరుగా ప్రచారం నిర్వహించారు. స్థానికేతరులంతా నియోజకవర్గం విడిచివెళ్లాలని ఈసీ ఇప్పటికే ఆదేశించడంతో ముఖ్య నేతలంతా మునుగోడును వీడుతున్నారు. ఇక నవంబర్ 3వ తేదీ ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్‌ జరగనుంది.