ముఖ్య మంత్రి కేసీఆర్ నిర్ణయం అద్భుతం : మంత్రి కేటీఆర్
తెలంగాణలోని అన్ని వయసుల వారికి ఉచితంగా టీకాలు వేయాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయం అద్భుతమని మంత్రి కేటీఆర్ కొనియాడారు. ట్విట్టర్ ద్వారా మంత్రి స్పందిస్తూ.. ఈ పరీక్షా సమయంలో ప్రజలకు తమ ప్రభుత్వాల నుండి వీలైనంత మద్దతు అవసరమన్నారు. సీఎం నిర్ణయానికి చేతులెత్తి దండం పెడుతున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.
ప్రజలు ఏ విధమైన భయభ్రాంతులకు గురికావద్దని, కరోనా సోకినవారికి పడకల విషయంలోనూ, మందుల విషయంలోనూ ప్రభుత్వం చేయాల్సినదంతా చేస్తున్నదని, ప్రజలను కోవిడ్ బారి నుండి కాపాడడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని, పెద్ద ఎత్తున సానిటేషన్ చేపట్టిందనీ ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.