మాజీ మంత్రి రాజేందర్పై తొలిసారిగా స్పందించిన.... మంత్రి కేటీఆర్
ఈటల రాజేందర్ వ్యవహారంలో తొలిసారిగా స్పందించారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు. ఆయనకు టీఆర్ఎస్ పార్టీ ఎంత ఇచ్చిందో, ఏమి చేసిందో ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. ఈటలకు జరిగిన అన్యాయం ఏంటో చెప్పాలన్నారు. మీడియాతో చిట్చాట్గా మాట్లాడిన కేటీఆర్.. మాజీ మంత్రి ఈటల రాజేందర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజేందర్ ఆత్మవంచన చేసుకుంటున్నారని కామెంట్ చేశారు.