మహా రాష్ట్రలో 3,089పాజిటివ్ కేసులు

దేశంలో పెరుగుతున్న కరోనా

12,380మొత్తం కేసులు మృతులు 414, 1489రికవరీ

మహా రాష్ట్రలో 3,089పాజిటివ్ కేసులు

                 దేశంలో రోజు రోజుకు కోవిడ్ కేసుల సంఖ్య పేరుగుతుంది.  ప్రదానంగా  మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య  పెరుగుతూనే ఉన్న‌ది. ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,089కి చేరింది. అయితే ముంబాయి నగరంలో భారీగా కేసులు పెరుగుతున్నాయి. ఆసియాలో అతిపెద్ద మురికివాడ  ధారావిలో కేసులు పెరుగుతున్నాయి.  గడిచిన  24 గంటల్లో అక్క‌డ తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం కేసులు 12,380 మంది కరోనా భారీన పడగా మొత్తం 414మంది మృతి చెందారు. అయితే వివిధ రాష్ట్రాల్లో 1,489 మంది కరోనాను అధికమించి రికవరీ అయ్యారు.