బీజేపీకి షాక్.. టీఆర్ఎస్‌లోకి కీలక నేత.!

  ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్. సి.లక్ష్మారెడ్డి అన్నారు. బాదేపల్లి చంద్రగార్డెన్స్ లో బీజేపీ రాష్ట్ర స్టడి సర్కిల్ కన్వీనర్ పాలది రాంమోహన్ 150 మంది కార్యకర్తలతో కలిసి జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు. 70 ఏండ్లు నుండి దేశాన్ని పాలిస్తూ వస్తున్నా బీజేపీ, కాంగ్రెస్ లు చేసిందేమీ లేదని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు రోజుకు కొంచెం పెంచుకుంటూ ప్రజలపై భారం వేస్తున్నారని ఆరోపణలు చేశారు.