బిజేపి చర్యలు ఖండిస్తున్నా - మేయర్

            బిజేపి కార్పోరేటర్ల చేసిన నిరసన సరైన పద్దతిలో లేదన్నారు జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి. బిజేపి శ్రేణులు ద్వం సం చేసింది మేయర్ ప్రాపర్టీ కాదని..., అది పబ్లీక్ ప్రాపర్లీ అన్నారు. బిజేపి రాయకీయ దురుద్దేశంతోనే ఈ కార్యక్రమం చేసిందన్నారు. చాలా సార్లు బిజేిపి కార్పోరేటర్ల డివిజన్లలో పర్యటించి  సమస్యల పరిష్కారానికి తాను కృషి చేశానని..., సమస్యలపై అధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాని..., ప్రజా ఇబ్బందుల పరిష్కారానికి తన దగ్గరికి వచ్చిన కార్పోరేటర్లు సంతోషంగా తిరిగి వెళ్లిన అంశాన్ని ఆమె గుర్తు చేశారు. ఇది కార్పోరేటర్లు చేసిందా.., లేక బిజేపి హైకామాండ్ చేబితే చేశారా అనేది చెప్పాలని డిమాండ్ చేశారు మేయర్. వరుసగా ఎన్నికల కోడ్ రావడంతోనే తాము పాలకమండలి సమావేశాలు నిర్వహించలేదని చెప్పుకోచ్చారు. జిహెచ్ఎంసికి స్వచ్ సర్వేక్షన్ లోనూ మంచి గుర్తింపు వచ్చిందని అందుకే  ఒర్వలేక ఇలాంటి పనులు చేశారు అని అన్నారు మేయర్ విజయ లక్ష్మి.