బిఎంఎస్ నూతన కమీటి ఎన్నిక..

గ్రేటర్ హైదారబాద్ మున్సిపల్ కార్పోరేషన్ లో బిఎంఎస్ కు అనుబందంగా పనిచేస్తున్న బాగ్యనగర్ మున్సిపల్ జిహెచ్ఎంసి ఎంప్లాయిస్ యూనియన్ జనరల్ బాడి సమావేశంలో నూతన కమీటిని ఎన్నుకున్నారు కార్మికులు.  కమీటి అద్యక్షులుగా  సంజయ్ కుమార్   .. ప్రదాన కార్యదర్శిగా జి. రాజేశ్వర్ రావు.. ఎన్నిక అయ్యారు. ఉపాద్యక్షులుగా జి. అనంద్ కుమార్., ఎ. కృష్ణ..,  కార్యదర్శులుగా జాబ్రి.. టి. కృష్ణ, కోశాదికారిగా సాయికుమార్, సంఘటన కార్యదర్శిగా ఎ శంకర్ ఎన్నిక అయ్యారు. 

                 ఈ సమావేశానికి బిఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి బి. రవీంద్ర రాజు వర్మ ముఖ్య అతితిగా హాజరయ్యారు. రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసి బిఎంఎస్ సంఘాన్ని మరింతబలమైన యూనియన్ గా తీర్చిదిద్దాలని కార్మికులకు పిలుపునిచ్చారు బి. రవీంద్ర రాజు వర్మ. జిహెచ్ఎంసిలో పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లను వెంటనే ఇవ్వాలని జనరల్ బాడి సమావేశం తీర్మాణం చేసింది. అనంతరం కోత్తగా ఎన్నిక అయిన కమీటి సభ్యులు కమీషనర్ లోకేష్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.