బల్దియా మేయర్ గా విజయలక్ష్మి

జీహెచ్ఎంసీ మేయర్‌గా బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు.... 

    గ్రేటర్ నూతన మేయర్ విజయలక్ష్మి టీఆర్ఎస్ సీనియర్ ఎంపీ కే.కేశవరావు కూతురు. ఆమె 1964లో జన్మించారు.  విజయలక్ష్మి జర్నలిజం బీఏ, ఎల్‌ఎల్‌బీ చదివారు. అమెరికాలోని నార్త్ కరోలినాలో డ్యూక్ యూనివర్సిటీలో పరిశోధన సహాయకురాలిగా పనిచేశారు. 2015లో స్వదేశానికి తిరిగొచ్చారు. రాజకీయాల్లో చేరేందుకు నిర్ణయించుకున్న ఆమె.. అమెరికా పౌరసత్వం వదులుకున్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన గద్వాల విజయలక్ష్మి బాబీరెడ్డిని పెళ్లి చేసుకున్నారు.

2015 నుంచి రాజకీయాల్లోకి వచ్చిన గద్వాల విజయలక్ష్మి.. 2016 ఎన్నికల్లో టీఆర్ఎస్ కార్పొరేటర్‌గా భారీ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో బంజారాహిల్స్ కార్పొరేటర్‌గా రెండోసారి ఆమె విజయం సాధించారు.