పల్లా రాజేశ్వర్ గుర్తింపు రద్దు చేయాలి... :తీన్మార్ మల్లన్న

   ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించిన అనురాగ్ యూనివర్సిటీలో బోగస్ ఓట్లు సృష్టిస్తున్నారని స్వతంత్ర అభ్యర్థి  తీన్మార్ మల్లన్న ఆరోపించారు. దాని గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ శశాంక్ గోయల్‌ను మంగళవారం కలిసి బోగస్ ఓట్ల వివరాలను అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పల్లా రాజేశ్వర్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు.