పంచతత్వ పార్కు ప్రారంభం
పంచతత్వ పార్కు ప్రారంభం.
హైదరాబాద్ నగరంలో పార్కులపై జిహెచ్ఎంసి ప్రత్యేక దృష్టి సారించింది. జోన్ల వారిగా వివిధ రకాల పార్కులను అభివృద్ది చేస్తున్న బల్దియా ఇందిరా పార్కు లో పంచతత్వ ఆక్యూప్రెజర్ వాకింగ్ పార్కును అభివృద్ది చేస్తుంది. దానిని మున్సిపల్ శాఖా మంత్రి కేటిఆర్ మేయర్ బోంతు రామ్మోహన్ స్థానిక ఎమ్మేల్యే తో కలిసి ప్రారంభించారు. ఎనిమిది అంశాలతో ఈ పార్కును నిర్మించారు. ట్రాక్ పై నడుస్తున్నప్పుడు పాదాల అడుగు భాగంలో ఉన్న నరాలపై వివిధ స్థాయిలో ఒత్తిడిని కలిగించే పద్దతిలో 20 ఎం.ఎం, 10 ఎం.ఎం గుళక రాళ్లు, నధిలో లబించే స్మూత్ రాళ్లు.. 6 ఎం.ఎం చిప్స్, ఇసుక, చెట్ల బెరడు, నల్లరేగడి మట్టి, నీటి బ్లాక్లను విడివిడిగా అనుసంధానం చేస్తూ వాకింట్ ట్రాక్ను నిర్మించారు. పార్కులో 40 రకాల మెడిసినల్, హెర్బల్ ప్లాంట్స్ను బ్లాక్లుగా ఏర్పాటు చేశారు జిహెచ్ఎంసి అధికారులు. మొదటగా నరాలపై అధిక ఒత్తిడి కలిగించే ట్రాక్ నుండి క్రమ పద్దతిలో ఒత్తిడి తగ్గించే ట్రాక్ వైపు నడవటం వల్ల రక్తప్రసరణలో సానుకూల మార్పు జరిగి వివిధ రకాల అనారోగ్యాలు దూరమవుతాయంటున్నారు అధికారులు.