న‌గ‌రంలో మ‌ల్టీలేవ‌ల్ పార్కింగ్

న‌గ‌రంలో మ‌ల్టీలేవ‌ల్ పార్కింగ్

              హైద‌రాబాద్ న‌గ‌రంలో బహుళ అంతస్తుల పార్కింగ్  నిర్మాణాలను చేపట్టేందుకు  కువైట్ కి చెందిన  ప్రముఖ బహుళ జాతి సంస్థ కే.జీ.ఎల్ ముందుకు వ‌చ్చింది. ఈ విష‌య‌మై కే.జీ.ఎల్ ప్రతినిధులు అల్ హసన్ ఆల్ దాహూద్, యూసుఫ్ సయీద్ డాస్తీలతో ఈ విశయమై నగర మేయర్ బొంతు రామ్మోహ‌న్, జిహెచ్ఎంసి క‌మిష‌న‌ర్ డి.ఎస్‌.లోకేష్ కుమార్, అడిష‌న‌ల్ డి.జి జితేంద‌ర్‌, హైద‌రాబాద్ న‌గ‌ర ట్రాఫిక్ విభాగం అడిష‌న‌ల్ సిపి అనిల్ కుమార్‌లు స‌మావేశం నిర్వ‌హించారు. కువైట్‌తో పాటు ప‌లు గ‌ల్ఫ్ దేశాల్లో త‌మ సంస్థ ద్వారా నిర్వ‌హిస్తున్న మ‌ల్టీలేవ‌ల్ పార్కింగ్ ప్రాజెక్ట్‌ల‌ను ఈ సంద‌ర్భంగా కె.జి.ఎల్ ప్ర‌తినిధులు వివ‌రించారు. స్ట్ర‌క్చ‌ర‌ల్‌, లాజిస్టిక్‌, చైన్ మేనేజ్మెంట్ తదితర రంగాల్లో మద్య ప్రాచ్య దేశాలలో త‌మ సంస్థ ద్వారా చేప‌ట్టిన ప్రాజెక్ట్‌ల‌ను వారు ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ద్వారా వివ‌రించారు.