నేడు దళితబందు పథకానికి శ్రీకారం..

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న దళితబంధు పథకానికి ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టబోతున్నారు. హుజురాబాద్ నియోజకవర్గం నుంచి దళిత బంధు పథకం ప్రారంభం కానుంది. నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట మండలం శాలపల్లిలో దళిత బంధు ప్రారంభోత్సవ సభ జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు ఎర్రవెల్లి ఫాంహౌజ్ నుంచి సీఎం కేసీఆర్ హుజురాబాద్ బయలుదేరుతారు. మధ్యాహ్నం 1:40 గంటలకు సభా స్థలికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు శాలపల్లిలో గ్రామంలో జరిగే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ముఖ్యమంత్రి సభా ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు దగ్గరుండి మరీ ఏర్పాట్లను పర్యవేక్షించారు.