నగర మేయర్కు ఊహించని షాక్..
హైదరాబాద్ మేయర్గా పదవి బాధ్యతలు స్వీకరించిన గద్వాల విజయలక్ష్మికి ఊహించని షాక్ తగిలింది. మేయర్ పీఠం అధిష్టించి రెండు రోజులు గడువక ముందే జీహెచ్ఎంసీ అధికారులు అదిరిపోయే ఝలక్ ఇచ్చారు.
మేయర్గా ఆమె ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఫిబ్రవరి-11వ తేదీన కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు శుభాకాంక్షలు తెలుపుతూ నగరంలో పలుచోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అనధికారికంగా వాటిని ఎలా పెడతారంటూ నెటిజన్లు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో జీహెచ్ఎంసీ అధికారులు స్పందించారు. ఈవీడీఎం విభా గం శనివారం సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తించారు. మొత్తం 30 చలాన్లు రాసి, సుమారు రూ.6లక్షల జరిమానాను విధించారు. . కాగా, ఈ జరిమానా నేరుగా మేయర్ విజయలక్ష్మికి కాకుండా, ఫ్లెక్స్ ఏర్పాటు చేసిన అతిష్ అగర్వాల్ అనే వ్యక్తికి విధించినట్లు సమాచారం. నగర ప్రథమ పౌరురాలిగా బాధ్యతలు చేపట్టిన రెండ్రోజుల్లోనే జీహెచ్ఎంసీ నుంచి చేదు అనుభవం ఎదురవడంతో ఏం చేయాలో తోచక టీఆర్ఎస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు.