దేశంలో విస్తరిస్తున్న కరోనా

3,700మందికి కరోనా పాజిటివ్

109 మంది మృతి

                    దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తుంది. గత వారంలో చాలా తక్కువగా ఉన్న కరోనా కేసులు డిల్లి నిజాముద్దీన్ ఘటన తరువాత ఒక్కసారిగా పేరగడం ప్రారంభమైంది. డిల్లిలో నిర్వహించిన తబ్లిగీ జమాత్ కు హజరు అయిన వారి వల్ల దేశంలోని పలు జిల్లాలు నగరాల్లో వేగంగా కరోనా పాజిటివ్ కేసులు విస్తరించాయి. దేశంలో వారి ద్వారా కరోనా సోకిన వారు కూడా ఉన్నారు. అలా మొత్తం 22వేల మందిని  క్వారంటైన్ చేశారు.

                   దేశంలో ప్రస్తుతం3700కేసులు ఉన్నాయి వాటిలో 30శాతంపైగా తబ్లిగీ జమాత్ తో సంభందం ఉన్న కేసులుగా అధికారులు చెబుతున్నారు. తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, డిల్లి, మహరాష్ట్ర, కర్ణాటక, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో మర్కజ్ నుండి వచ్చిన వారి కేసులు అధికంగా ఉన్నాయి.