తూ.గో.జిల్లాలో రెచ్చిపోయిన వైసీపీ, జనసేన కార్యకర్తలు

తూర్పుగోదావరి: జిల్లాలో వైసీపీ, జనసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. ఉప్పాడలో టీడీపీ అభ్యర్థి వర్మ కారుపై వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. వైసీపీ కార్యకర్తల దాడి నుంచి వర్మ తప్పించుకున్నారు. అలాగే అమలాపురం రూరల్ జనుపల్లిలో కానిస్టేబుల్‌పై జనసేన కార్యకర్తల దాడికి తెగబడ్డారు. గాల్లోకి పోలీసులు కాల్పులు జరిపి చెదరగొట్టారు.