టీ కాంగ్రెస్‌కు మరో షాక్: మాజీ ఎమ్మెల్యే కూన రాజీనామా..

  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కి మరో ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకీ బలహీనంగా మారుతోంది. అదే సమయంలో పార్టీకి చెందిన పలువురు నేతలు టీఆర్ఎస్, బీజేపీలో చేరేందుకు రెడి అవుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంపిన శ్రీశైలం గౌడ్.. ఢిల్లీకి బయలు దేరారు. కాంగ్రెస్ ను వీడిన శ్రీశైలం గౌడ్ బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో  శ్రీశైలం గౌడ్ ఢిల్లీకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది.