టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారినా మా జెండా,అజెండా,డీఎన్ఏ మారదు : కేటీఆర్

  కేంద్ర ప్రభుత్వంపై మంత్రికేటీఆర్ మారోసారి తనదైన శైలిలో సెటైర్లు వేశారు. సూర్యాపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ కేంద్రం తెలంగాణాకు ఇచ్చిన నిధుల విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సవాల్ విసురుతూ ‘టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారినా మా జెండా,అజెండా, డీఎన్ఏ మారదు అంటూ స్పష్టంచేశారు కేటీఆర్. కేంద్రానికి తెలంగాణ రూ.3లక్షల 68వేల కోట్ల పన్నులు చెల్లించామని కానీ కేంద్రం మాత్రం తెలంగాణకు ఇచ్చింది కేవలం రూ. లక్షా 68వేల కోట్లు మాత్రమేనని తెలిపారు.